Friday, May 3, 2024

Yashoda Hospital | నేనే వస్తా.. ఎవ్కరూ రావద్దు.. కేసిఆర్ వినతి

సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు పరామ‌ర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.. వారుసైతం యశోద హాస్పటల్‌కు వెల్లువలా తరలి వస్తున్నారు. తమ నేతను చూసేందుకు గంటల తరబడి అక్కడే నిరీక్షిస్తున్నారు.

ఈ క్రమంలో కేసీఆర్ తనను చూసేందుకు యశోద ఆస్పత్రికి ఎవ్వరు రావద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలా రావటం వల్ల తనతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఇబ్బంది కలుగుతోందని, ఎవ్వరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ‘‘తన వల్ల.. ఇతర రోగులు ఇబ్బందులు పడకూడదన్నారు. ఇన్ ఫెక్షన్ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారని కాబ‌ట్టి ఎవ్వరు ఆస్పత్రికి రావద్దని కోరారు. తాను త్వరలోనే కోరుకుని ప్రజల ముందుకు వస్తానని తెలిపారు కేసిఆర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement