Thursday, April 25, 2024

ప్రశాంతంగా ముగిసిన ఏఈఈ పరీక్ష..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ పరీక్ష ఇవ్వాల (ఆదివారం) ప్రశాంతంగా ముగిసింది. వివిధ విభాగాల్లోని 1540 ఖాళీలకు మొత్తం 81,548 మంది దరఖాస్తు చేసుకోగా 75,265 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

పేపర్‌-1, పేపర్‌-2కు రెండు సెషన్లలో జరిగిన పరీక్షకు ఉదయం సెషన్‌ పేపర్‌-1 పరీక్షకు 61,453(75.36శాతం) మంది, మధ్యాహ్నం పేపర్‌-2 పరీక్షకు 61,279(75.14శాతం) మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఏడు జిల్లాల్లో 176 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement