Saturday, May 4, 2024

మ‌హిళ‌ల అభ్యున్న‌తికి పెద్ద‌పీట : మంత్రి స‌త్య‌వ‌తి

కేసముద్రం (ప్రభ న్యూస్) : మ‌హిళ‌ల అభ్యున్న‌తికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద‌పీట వేస్తుంద‌ని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మ‌హిళ దినోత్స‌వ వేడుక‌లు జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి మంత్రి స‌త్య‌వ‌తి ప్రారంభించారు.

మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో జరిగిన మహిళ దినోత్సవ కార్యక్రమ వేడుకల్లో బోనాలు, కోలాటాలు, బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీలో మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఎంపీ మాలోత్ కవిత, శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్, సతీమణి డా.సీతామహాలక్ష్మీ, జిల్లా కలెక్టర్ శశాంక, ఎంపీపీలు, జెడ్పిటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల, గ్రామ భారాస నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement