Monday, April 29, 2024

త‌ల్లిబాట‌లో కుమారై..పొగిడేస్తోన్న రోజా..

ఒక ప‌క్క రాజ‌కీయాలు ..మ‌రో ప‌క్క ఎంట‌ర్ టైన్ మెంట్ రంగంలో ఉంటూ బిజీగా గ‌డిపేస్తున్నారు ఎమ్మెల్యే రోజా. అంతే కాదు కొంత మంది పిల్లల్ని కూడా తన సొంత డబ్బుతో చదివిస్తూ ఉన్నారు. ఇక రాజకీయ నాయకురాలిగా కూడా నగరి అభివృద్ధికి పాటుపడుతూ ప్రజలలో మంచి నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే తల్లి బాటలోనే కూతురు అన్నట్టుగా తన కూతురు అన్షు మాలిక కూడా అది చిన్న వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం..రోజా ఇటీవల మాట్లాడుతూ.. తన కూతురు ఒక ప్రముఖ ఎన్జీవో ఆర్గనైజేషన్ ద్వారా ఐదు మంది పిల్లలను దత్తత తీసుకొని చదివిస్తోంది అని, ఇంత చిన్న వయసులోనే తన కూతురికి అలాంటి ఆలోచన వచ్చినందుకు తనకు చాలా గర్వంగా ఉందని తెలిపింది. అంతే కాదు తన కూతురు మాలికకు చదువు అంటే ఎనలేని ఇష్టం అని, ఆమె ఎప్పుడూ నిరంతరం పుస్తకాలను చదువుతూనే ఉంటుంది అని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement