Friday, April 19, 2024

ఏఎస్ఐ కుటుంబానికి సైబరాబాద్ సీపీ ఆర్థిక సహాయం

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్ట‌ర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వర్తిస్తూ.. రోడ్డు ప్రమాదంలో మరణించిన మహ్మద్ రవూఫ్ కుటుంబ సభ్యులకు సోమవారం తన కార్యాలయంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఆర్థిక సహాయం అందజేశారు. సీపీ తన చేతులమీదుగా చెక్కును ఏఎస్ ఐ కుటుంబ సభ్యులకు అందజేశారు. దులపల్లి చౌరస్తా లో మహ్మద్ రవూఫ్ విధులు నిర్వర్తిస్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన క్వాలిస్ వాహనo బలంగా ఢీకొట్టగా మహ్మద్ రవూఫ్ తలకు బలమైన గాయమై మరణించారు. ఈ సందర్భంగా సీపీ ఏఎస్ఐ మహ్మద్ రవూఫ్ కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా నిధుల‌ నుంచి ఏఎస్ఐ రావూఫ్ కుటుంబము సభ్యులకు రూ. 7,88,240 చెక్కును సీపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ రియాజ్, సైబరాబాద్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement