Tuesday, May 14, 2024

ప‌ద్మ‌నాభ‌స్వామి ఆల‌యంలో త‌న‌యుడితో న‌టి రాధ‌..మంత్రిపై ప్ర‌శంస‌లు..

సీనియ‌ర్ న‌టీమ‌ణుల్లో రాధ ఒక‌రు. మెగాస్టార్ చిరంజీవితో పాటుగా స్టెప్పులు వేయ‌డం ఆమెకే చెల్లింది. కేరళ భామ రాధ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించి అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. ఇక 1991లో వ్యాపారవేత్త రాజశేఖరన్ నాయర్ ను పెళ్లాడిన తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించలేదు.తాజాగా రాధ తన కుమారుడు విఘ్నేశ్ తో కలిసి కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. అదే సమయంలో స్వామివారి దర్శనానికివచ్చిన కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ను కలిశారు. పరిపాలన తీరుతెన్నులపై కాసేపు ముచ్చటించినట్టు రాధ ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిపై ఆమె ప్రశంసలు జల్లు కురిపించారు. ఎంతో సానుకూల దృక్పథం, అద్భుతమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement