Thursday, May 2, 2024

నా కెరీర్ లో ఎన్నో అవ‌కాశాలు మిస్ అయ్యా-న‌టి అర్చ‌న‌

ప‌లు చిత్రాల్లో న‌టించిన అర్జ‌న హెల్త్ కేర్ వైస్ ప్రెసిడెంట్‌ జగదీష్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. కాగా ఆలీ హోస్ట్ గా రన్‌ అవుతున్న అలీతో సరదాగా టాక్‌ షోలో పాల్గొంది. ఇందులో తన భర్త జగదీష్‌తో కలిసి ఆమె పాల్గొంది. తాజాగా ఈ షో ప్రోమో విడుదలైంది. ఇందులో అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది అర్చన. తన భర్త ఎలా కలుసుకున్నారనేది చెప్పింది.శ్రీరామదాసు్‌ సినిమా చేస్తున్నప్పుడు తన వయసు చాలా చిన్నది అని, సుమన్‌రాముడిగా చేస్తే, ఆయన పక్కన సీతాదేవి నటించానని, అంత బాగా నటించడానికి క్రెడిట్‌ మొత్తం కె.రాఘవేంద్రరావుదే అని చెప్పింది అర్చన. మళ్లీ సినిమా ఎప్పుడు అంటూ రాఘవేంద్రరావుని అడిగింది. అర్చన, జగదీష్‌ మ్యారేజ్‌ కార్డ్ ప్రింట్‌ అయ్యాక వెన్యూ మారిపోయిందేంటి అని అలీ అడిగిన ప్రశ్నకి ఆర్చన స్పందిస్తూ, ఇలాంటి కోతి ఐడియాలు, సడెన్‌గా ప్లాన్‌ మార్చే ఐడియాలు ఇద్దరికి ఒకేసారి వస్తాయని, ఆ టైమ్‌లో ఇక్కడే చేసేసుకుందామా పెళ్లి అని జగదీష్‌ అన్నాడని తెలిపింది. మొత్తంగా తన పెళ్లి వెన్యూ ఎలా మారిపోయిందో వివరించింది. ఇద్దరిలో తనే రొమాంటిక్‌ అని అర్చన చెప్పింది.

రాజమౌళి సినిమా ఆఫర్‌ కోల్పోవడం గురించి అర్చన చెబుతూ, య‌మ‌దొంగలో సాంగ్‌ చేశానని, మ‌గ‌ధీర‌లో ఓ చిన్న క్యారెక్టర్‌కి తనని అడిగారు. కానీ చేయనని చెప్పాను. తన బ్రెయిన్‌ చిన్నదని, లౌక్యం తక్కువ అని, దీంతో అలా నో చెప్పినట్టు తెలిపింది. అది చేసి ఉంటే తన లైఫ్‌ వేరేలా ఉండేదని పేర్కొంది. నెక్ట్స్ సినిమాలో హీరోయిన్‌గానూ అవకాశం వచ్చేదని పేర్కొన్నారు. సరదా సరదాగా సాగిన టాక్‌ షోలో చివరిలో హీటెక్కించారు అలీ. పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చి లాస్ట్ మినిట్‌లో డ్రాప్‌ అయిన సినిమాలేమైనా ఉన్నాయా? అని అలీ అడిగిన ప్రశ్నకి ఎమోషనల్‌ అయ్యింది అర్చన. షోలోనే భర్త ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తన కెరీర్‌లో ఎన్నో అవకాశాలు మిస్‌ అయినట్టు చెప్పకనే చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement