Monday, April 29, 2024

రివైండ్: 14 ఏళ్ల క్రితం చరిత్ర సృష్టించిన సచిన్

భారత క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌ను దేవుడితో పోలుస్తారు. ఈ నేపథ్యంలో క్రికెట్ దేవుడు సచిన్‌కు ఈరోజు ఎంతో గుర్తుండిపోయే రోజు. సరిగ్గా 14 ఏళ్ల క్రితం అంటే జనవరి 29, 2007న సచిన్ వన్దేల్లో 15 వేల పరుగులను సాధించి, చరిత్ర పుటల్లో నిలిచాడు. వన్డేల్లో 15 వేల పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. బెల్ ఫాస్ట్‌లో సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో సచిన్ ఈ ఘనతను సాధించాడు. 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సచిన్ 106 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. ఈ సందర్భంగా 15 వేల మైలు రాయిని దాటాడు. ఈ ఇన్నింగ్స్ లో సచిన్ 13 ఫోర్లు, రెండు సిక్సర్లను బాదాడు. 93 పరుగులు చేసిన సచిన్ 32వ ఓవర్ లో ఔటయ్యాడు. అయినప్పటికీ ఆ మ్యాచ్ లో ఇండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇన్నింగ్స్ చివరలో యువరాజ్ సింగ్, దినేశ్ కార్తీక్ అద్భుతంగా ఆడి భారత్ కు విజయాన్ని అందించారు.

సచిన్ తన వన్డే కెరీర్లో 18,426 పరుగులు సాధించాడు. 49 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన తన కోరీర్లో సచిన్ ఆరు ప్రపంచకప్ లకు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో భారత్ కు ప్రపంచకప్ అందించాడు. భారత్ క్రికెట్‌కు సచిన్ చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. భారతరత్న పురస్కారాన్ని అందుకున్న ఏకైక క్రీడాకారుడు సచిన్ మాత్రమే కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: మిథాలీ రాజ్ అరుదైన ఘనత

Advertisement

తాజా వార్తలు

Advertisement