Sunday, April 28, 2024

మిథాలీ రాజ్‌ అరుదైన ఘనత..

టీమ్‌ఇండియా ఉమెన్స్ క్రికెట్‌ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కొత్త రికార్డు సృష్టించింది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆమె 22 వసంతాలు పూర్తి చేసుకుంది. సచిన్‌ తర్వాత సుదీర్ఘ కాలం ఆడిన రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. 1999, జూన్‌ 26న మిథాలీ రాజ్‌ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచుతో 22 ఏళ్లు పూర్తి చేసుకొంది. అతి త్వరలో సచిన్‌ రికార్డునూ తిరగ రాయనుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం క్రికెట్‌ ఆడిన ఘనత ఇప్పటి వరకు సచిన్‌ పేరుతో ఉంది. ఆయన ఏకంగా 22 ఏళ్ల 91 రోజులు ఆటలో కొనసాగారు. అంటే మరో మూడు నెలలు ఆడితే మిథాలీ ఆయన రికార్డును అధిగమిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement