Monday, April 29, 2024

Accident – చెట్టును ఢీకొన్న పెళ్లి బృందం వాహ‌నం – అయిదుగురు దుర్మ‌ర‌ణం ..

జార్ఖండ్లో శనివారం తెల్లవారుజూమున జ‌రిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మ‌ర‌ణం చెందారు.. గిరిద్ జిల్లాలోని టోకియా గ్రామానికి పెళ్లి బృందంతో వెళుతున్న వాహనం అదుపుతప్పి ప్రమాదవశాత్తూ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. ఇద్దరు చిన్నారుల‌తో స‌హా మ‌రో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. .. వారి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement