Sunday, April 28, 2024

తిరుప‌తిలో.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్

స్టార్ హీరో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్న చిత్రం ఆదిపురుష్. రామాయణాన్ని కథగా చేసుకుని రూపొందిన ఈ సినిమాలో, సీత‌గా కృతి సనన్ నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖాయం చేశారు.
జూన్ 6వ తేదీన తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమా సంచలనానికి తెరతీయడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. భారీ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను జూన్ 16వ తేదీన తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement