Thursday, May 2, 2024

తల్లిని చంపేసి, తాను ఆత్మహత్యచేసుకున్న యువకుడు.. 77 పేజీల సుదీర్ఘ సూసైడ్‌ నోట్‌

తల్లిని హత్యచేసిన 25 సంవత్సరాల యువకుడు తాను ఆత్మహత్య చేసుకొని.. హత్యకు గల కారణాలను తెలుపుతూ 77 పేజీల సూసైడ్‌ లేఖ రాశాడు యువకుడు. ఈ ఘటన ఢిల్లిలోని రోహిణి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇంటినుండి దుర్వాసన రావడాన్ని గుర్తించిన రోహిణి ప్రాంతంలోని ఇరుగుపొరుగు వారు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి సమాచారాన్ని అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుర్వాసన రావడాన్ని గుర్తించి.. డోర్‌ ఓపెన్‌ చేయడానికి ప్రయత్నించగా డోర్‌కు లోపలివైపు గొళ్లెం పెట్టి ఉండటాన్ని గమనించి .. ఇంటిపై బాల్కాని నుంచి వెళ్లిన పోలీసులు ఇంటి డోర్‌ తెరువగా ఇంటిలో మొత్తం రక్తసిక్తమయ్యింది. రక్తపు మడుగులో ఉన్న యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పక్కనే బాత్‌రూమ్‌లో తల్లి మృతిచెందింది. మృతదేహం పూర్తిగా కుళ్లిన దశలో ఉంది.

ఈ హత్య మూడు రోజుల కిందట జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అనంతరం ఘటన స్థలంలో యువకుడు 77 పేజీల సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్‌లో తల్లిని తానే హత్యచేశానని, నిరుద్యోగిగా ఉండటం వల్ల మానసిక వ్యధకు గురై ఈ పని చేసినట్లు నోట్‌లో సుధీర్ఘంగా తల్లి హత్య, తాను ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. తల్లిని హత్య చేసిన అనంతరం తాను మెడపై కత్తితో కోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. నోట్‌ను స్వాధీనం చేసుకొని.. మృతదేహాలను పోస్టుమార్టం తరలించినట్లు డీసీపీ ప్రణవ్‌ తాయల్‌ తెలిపారు. అనంతరం కేసు విచారణ నిమిత్తం .. క్రైం టీమ్స్‌ రంగంలోకి దిగినట్లు.. ఆధారాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించినట్లు చెప్పారు. బాధితుల వివరాలు కనుగొనేందుకు వారి బంధువుల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement