Saturday, April 27, 2024

Mamata Banerjee: ఇండియా కూట‌మికి షాక్… బెంగాల్ బ‌రిలో దీదీ ఒంట‌రి పోరు..

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. మొత్తం అన్ని సీట్ల‌కు పోటీ చేస్తామ‌ని తేల్చి చెప్పారు.. ఇండియా కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న తృణ‌మూల్ లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ తో పొత్తుకు స‌సేమిరా అంటున్న‌ది.. ఇదే విష‌యాన్ని నేడు కోల్ క‌తాలో మమ‌త తేల్చి చెప్పారు..

క‌మ్యూనిస్ట్ ల‌తో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం ఎక్కువ సీట్లు అడుగుతుండ‌టంపై దీదీ ఫైర్ అయ్యారు.. ఇక‌పై బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపబోమ‌ని తెలిపారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము ఇండియా కూటమిలో ఉన్నా రాహుల్‌ గాంధీ యాత్రపై తమకు సమాచారం లేదన్నారు. కాంగ్రెస్ వి ఒంటెద్దు పోక‌డ‌లంటూ చుర‌క‌లంటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement