Wednesday, May 15, 2024

ఆధునిక పద్ధతుల్లో చేపల ఉత్పత్తుల ప్యాకింగ్‌.. ఎక్కువ రోజులు నిలువ ఉంచే పద్ధతులపై సమీక్ష

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో తయారు చేసే చేపల ఉత్పత్తులను ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్‌ నిర్వహించడానికి అనుసరించవలసిన విధానాలపై అధికారులు సమీక్షించారు.సనత్‌ నగర్‌లోని ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ కేంద్ర కార్యాలయాన్ని గురువారం ఫిషరీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ పిట్టల రవీందర్‌ ఈమేరకు సందర్శించారు. రాష్ట్ర రాజధాని నగరంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన నగరాలలో భవిష్యత్తులో ప్రారంభించనున్న ఫిష్‌ ఫుడ్‌ సెంటర్లలో చేపల ఆహార ఉత్పత్తులను శాస్త్రీయంగా, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ప్యాకేజింగ్‌ నిర్వహిచడానికి అనుకూలమైన మార్గాలపై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌, ప్రధానాధికారి ఎన్‌.నటరాజ్‌తో చర్చించారు. భవిష్యత్తులో తయారు చేయనున్న చేపల పచ్చళ్లు, రొయ్యల పచ్చళ్లను ఎక్కువ కాలం నిలువ ఉంచేందుకు వీలున్న ప్యాకేజీ పద్ధతులపై చర్చించారు. ఈ సమావేశంలో ఫిషరీస్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌ ఉప్పల శ్రీనివాస్‌, ఇతర అధికారులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement