Thursday, April 25, 2024

క‌మ్మేసిన పొగ‌మంచు… ఎడ్లబండిని ఢీ కొన్న లారీ.. ఇద్దరు మృతి

మూడురోజులుగా చ‌లి తీవ్ర‌త చాలా పెరిగిపోయింది. దీనికి తోడు పొగ‌మంచు కూడా క‌మ్మేస్తుంది. ఉద‌యం 9 గంట‌లు దాటితేగానీ రోడ్లు క‌నిపించ‌ని వైనం. దీంతో రోడ్ల‌పై ప్ర‌మాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా అగళిలో పొగమంచు కారణంగా ముందువెళ్తున్న ఎడ్ల బండిని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎడ్లబండిపై ఉన్న ఇద్దరు మృతి చెందగా లారీలోని ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మడకశిర ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement