Wednesday, April 24, 2024

నేడు శ్రీలంక వ‌ర్సెస్ భార‌త్ మూడో T20

రాజ్‌కోట్ వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే 1- 1 తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఇవాళ ఇరు జట్లు మధ్య ఫైనట్ టీ20 జరగనుంది. తొలి రెండు టీ20ల్లో యువ భారత్ ఆటగాళ్లు ఆశించిన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఒక దశ తర్వాత బౌలింగ్ పూర్తిగా అదుపు తప్పింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రెండుసార్లూ చేతులెత్తేశారు. తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతికి గెలిచిన హార్దిక్ సేన.. ఆ తర్వాత మ్యాచ్‌లో ఆరంభం సరిగా లేక చివర్లో దెబ్బతింది. మరోవైపు లంక బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ సత్తా చాటుతోంది. అయితే ఈరోజు రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement