Sunday, April 28, 2024

షిరిడీ సాయికి బంగారు పుష్పాలు.. విరాళంగా ఇచ్చిన హైద‌రాబాద్ భ‌క్తుడు

షిరిడీ, (ప్రభన్యూస్‌) : హైదరాబాద్ కు చెందిన ఎం రాజేంద్ర‌నాథ్ రెడ్డి షిరిడీ సాయిని ద‌ర్శించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న షిరిడీ సాయి సంస్థాన్‌కు 9,98,479 రూపాయ‌ల విలువైన 214.45 గ్రాముల మూడు బంగారు పుష్పాల‌ను సాయినాథునికి అంద‌జేశారు. కాగా, ఈ విరాళాన్ని ట్ర‌స్ట్ సీఈవో బాగ్య‌శ్రీ‌ బ‌నాయ‌త్ స్వీక‌రించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ కైలాస్ ఖరాడే, ఆలయ విభాగాధిపతి రమేష్ చౌదరి, ఇంత‌ర సాయిభక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement