Saturday, May 4, 2024

మైనర్ బాలికతో అసభ్య ప్ర‌వ‌ర్త‌న‌.. 22 ఏళ్ల యువ‌కుడిపై కేసు నమోదు

చెన్నారావుపేట, (ప్రభ న్యూస్): వ‌రంగ‌ల్ జిల్లా చెన్నారావుపేట మండ‌లంలో ఓ యువ‌కుడిపై కేసు న‌మోద‌య్యింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (5), త‌న తల్లితో కలిసి బావి దగ్గరకు వెళ్లింది. ఇదే గ్రామానికి చెందిన రఘుపతి (22 ) అనే యువ‌కుడు చిన్నారికి జామకాయలు ఇస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు.

ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమె తండ్రి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్.ఐ.తోట మహేందర్ ను వివరణ కోర‌గా.. ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని.. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement