Monday, April 29, 2024

రికార్డ్ బ్రేక్….ఈ ఏడాదికి ఇవే హైయెస్ట్ కరోనా కేసులు !!

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 68,020 క‌రోనా కేసులున‌మోద‌య్యాయి. ఇక క‌రోనాకు చికిత్స పొందుతూ దేశ‌వ్యాప్తంగా 291 మంది మృతి చెందారు.

తాజా గణాంకాల ప్రకారం దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ న‌మోదైన కేసులు సంఖ్య 1,20,39,644 కు చేరింది. అలాగే క‌రోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,13,55,993 కు చేరింది. కాగా
క‌రోనాతో ఇప్ప‌టివ‌రకూ 1,61,843 మంది మృతి చెందారు.

మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 403 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,742 కి చేరింది. కాగా ఇందులో 3,00,469 మంది కరోనా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 4,583 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనాతో ఇప్పటి వరకు మొత్తం 1,690 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement