Tuesday, April 23, 2024

విరాట్ కోహ్లీ విస్మయం.. అవార్డులు ఇలా ఇచ్చారేంటి?

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును శ్యామ్ కరణ్‌కు ఇవ్వడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విస్మయం చెందాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక చేస్తారని తాను భావించానని మ్యాచ్ అనంతరం కోహ్లీ వ్యాఖ్యానించాడు. కానీ అందుకు భిన్నంగా కరణ్‌ను ఎంపిక చేయడంతో షాక్ తిన్నానని చెప్పాడు. అటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా అత్యధిక వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేస్తారని భావించానని పేర్కొన్నాడు. కానీ ఈ అవార్డు బెయిర్ స్టోకు ఇవ్వడంపైనా కోహ్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా ఏదేమైనా టాప్-2 జట్లు పోటీపడితే ఇలాంటి గొప్ప మ్యాచ్‌లే ఉంటాయని, ఇంగ్లండ్ తమకు గట్టి పోటీ ఇచ్చిందని, కరణ్ తిరుగులేని ఇన్నింగ్స్ ఆడాడని కోహ్లీ వెల్లడించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement