Monday, May 6, 2024

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 52 రైళ్లు రద్దు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లు రద్దయ్యాయి. వీటిలో జన్మభూమి, గరీబ్‌రథ్‌ కూడా ఉన్నాయి. ఈమేరకు ద.మ.రైల్వే సోమవారం విడుదల చేసిన ప్రకటనలో మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

గుండాలా-విజయవాడ సెక్షన్‌ పరిధిలో నాన్‌-ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఈ రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో మంగళవారం నుంచి ఈనెలాఖరు వరకు ఈ రైళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేసి రద్దు చేసిన రైళ్లను తిరిగి ప్రారంభించననున్నట్లు ద.మ.రైల్వే సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement