Monday, May 6, 2024

తమిళనాడులో విషాదం.. ఐదుగురు మహిళలు మృతి

తమిళనాడులోని తూత్తుకుడిలో ఘోర ప్రమాదం జరిగింది. వ్యాన్​-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మహిళా కూలీలు మరణించారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 17 మంది మహిళా కూలీలతో వెళ్తున్న వ్యాను.. నీళ్ల ట్యాంకర్​ లారీని ఢీకొట్టగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు అస్పత్రికి తరలిస్తుంటే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పుతియముత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

ఇది కూడా చదవండి: గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

Advertisement

తాజా వార్తలు

Advertisement