Tuesday, May 21, 2024

TS: సిగ‌రేట్ పీక‌తో 44 వాహ‌నాలు బూడిద‌..

హైద‌రాబాద్ – సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం.. ఇది అందరికీ తెలిసిందే.. అయితే ఎక్కడపడితే అక్కడ సిగరెట్ కాల్చి పడేయడం మరింత ప్రమాదకరం అని ముందు ముందు చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. సిగరెట్ కాల్చినప్పుడు చివరగా ఉండే చిన్న ముక్కను అజాగ్రత్తగా పడేయడం పెను ప్రమాదానికి కారణమవుతోంది. తాజాగా రామచంద్రాపురంలో ఇలాంటి ఘటనే జరిగింది. కొందరు వ్యక్తులు కాల్చి పారేసిన సిగరెట్ పీకలతో అదివారం రాత్రి అగ్నిప్రమాదం చెలరేగి వాహనాలు కాలి బూడిదయ్యాయి.

లింగంపల్లి జంక్షన్ పోలీస్‌ క్వార్టర్స్‌లో రామచంద్రాపురం, చందానగర్‌ పోలీస్ స్టేషన్ లకు సంబంధించి వివిధ కేసుల్లోని వాహనాలను ఉంచారు. చాలా రోజులుగా అవి అక్కడే ఉండటంతో వాటి చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి ఎండిపోయాయి. ఈ సమయంలో కొందరు వ్యక్తులు అక్కడ సిగరెట్లు కాల్చారు. పీకలను పిచ్చిమొక్కల్లో విసిరారు. అవి అగ్గి రాజేసి క్రమంగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 36 బైక్‌లు, 8 కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement