Thursday, May 16, 2024

ఇండియా బులెటిన్: మూడు నెలల తర్వాత తొలిసారిగా 50వేల లోపు కరోనా కేసులు

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,640 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,99,77,861 కి చేరింది. అలాగే ఇందులో 2,89,26,038 మంది కరోనా నుంచి కొలుకున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో 6,62,521 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.

ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1167 మంది కరోనా తో మృతి చెందారు. ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం మృతుల సంఖ్య 3,89,302 చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో 81,839 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement