Friday, May 17, 2024

Boat Capsize : పడవ బోల్తా.. 37మంది గల్లంతు

మధ్యధరా సముద్రంలో వలసదారులతో వెళ్తోన్న మరో పడవ బోల్తాపడింది. ట్యూనీషియా – ఇటలీ మధ్య సముద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 37మంది గల్లంతయ్యారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎమ్) తెలిపిన వివరాల ప్రకారం.. ట్యూనీషియా పోర్ట్ ఆఫ్ స్పాక్స్ నుంచి 46 మంది వలసదారులతో పడవ ఇటలీ బయలు దేరింది.

ఈ క్రమంలో బలమైన గాలుల కారణంగా వీరు ప్రయాణిస్తున్న బోటు ఇటాలియన్ ద్వీపం లాంపెడుసా వద్ద సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు, ఓ చిన్నారి సహా మొత్తం 37మంది గల్లంతయ్యారు. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడిన వారు ఉప-సహారా ఆఫ్రికాకు చెందిన వారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement