Sunday, April 28, 2024

Rifles:దేశ వ్యాప్తంగా అయిదేళ్ల‌లో 3351 మంది అమ‌రుల‌లైన కేంద్ర బ‌ల‌గాల సిబ్బంది..

దేశవ్యాప్తంగా జనవరి 1, 2018 నుండి డిసెంబర్ 1, 2023 వరకు మొత్తం 3351 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 275 మంది సైనికులు చర్యలో మరణించగా, 3076 మంది డ్యూటీలో మరణించారు. హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

పార్లమెంటులో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మాట్లాడుతూ అమరవీరులైన సైనికుల కుటుంబాలకు ఇచ్చే కేంద్ర ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని 15 లక్షల రూపాయల నుండి 35 లక్షల రూపాయలకు పెంచినట్లు చెప్పారు. కాగా విధి నిర్వహణలో అమరులైతే రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1939 ప్రకారం, అమరవీరులైన సైనికుల తదుపరి బంధువులు సరళీకృత కుటుంబ పెన్షన్ ప్రయోజనాలకు అర్హులని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement