Wednesday, May 15, 2024

తగ్గింది కేసులే…కరోనా కాదు!!

ఇండియా లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,549 కేసులు నమోదు అయ్యాయి.  దీంతో దేశంలో మొత్తం నమోదు అయిన కేసుల సంఖ్య 3,17,26,507కి చేరింది.  అయితే ఇప్పటివరకు 3,08,96,354 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  మరోవైపు గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 422 మంది మృతి చెందారు.

 కాగా మొత్తం మృతుల సంఖ్య 4,25,195 కి చేరింది. ఇక గ‌డిచిన 24 గంటల్లో 38,887 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు దేశంలో 47,85,44,114 మందికి టీకాలు వేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement