Sunday, April 28, 2024

భారత్‌లో 2025 విమెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌.. డిసైడ్ చేసిన అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి

2025 ఉమెన్స్‌ క్రికెట్‌ వన్డే వరల్డ్‌ కప్‌కు భారత్‌ ఆతిథ్య మివ్వనుంది. బర్మింగ్‌హోమ్‌లో సమావేశమైన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌ పర్యటనల కార్యక్రమం(ఎఫ్‌టీపీ) 2023- 2027లో భాగంగా అమ్మాయిల మెగా ఈవెంట్లను ఖరారు చేశారు. ముందుగా 2024 టీ20 వరల్డ్‌ కప్‌ బంగ్లాదేశ్‌లో నిర్వహించనున్నారు.

2026లో మరో టీ20 వరల్డ్‌ కప్‌ ఇంగ్లండ్‌లో జరుగునుంది. వీటితోపాటు 2023, 2025లో జరుగనున్న ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లకు లార్డ్స్‌ మైదానం వేదిక కానుంది. 2023 మెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌కు భారత్‌ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ముగిసే రెండేళ్లలోనే మహిళల వన్డే ప్రపంచకప్‌కూ భారత్‌ వేదిక కావడం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement