Saturday, April 27, 2024

1st Test : 400 పరుగులకు ఆలౌట్.. 223 పరుగుల ఆధిక్యంలో భారత్

నాగ్‌పూర్‌ వేదికగా భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్ 400 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 223 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బ్యాట్స్ మెన్లు రోహిత్ శర్మ 120 పరుగులు, అక్షర్ పటేల్ 84 పరుగులు, రవీంద్ర జడేజా 70 పరుగులు, మహమ్మద్ షమీ 37 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 23 పరుగులు, కేఎల్ రాహుల్ 20 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లు ముర్ఫీ ఏడు వికెట్లు తీయగా, కమ్మిన్స్ ఒక వికెట్, నాథన్ లయాన్ ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement