Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 17,070 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,34,69,234కు చేరాయి. ఇందులో 4,28,36,906 బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,139 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 1,07,189 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 23 మంది బాధితులు మరణించగా, 14,413 మంది డిశ్చార్జీ అయ్యారు. కరోనా కేసులు స్వల్పంగా తగ్గడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 3.40 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మొత్తం కేసుల్లో 0.24 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.55 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 197.74 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement