Tuesday, May 21, 2024

పిడుగు పాటుకు 16మంది మృతి – బాధిత కుటుంబాల‌కు రూ.4 ల‌క్ష‌ల ప‌రిహారం

ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కాగా బీహార్ లో పిడుగు పాటుకు 16మంది మృతి చెందారు. ఈ నెలలో ఇప్పటివరకు పిడుగుపాటు వల్ల మొత్తం 36 మంది మృతిచెందారని వెల్లడించారు.మరణించినవారిలో ఈస్ట్‌ చంపారన్‌ జిల్లాల్లో నలుగురు, భోజ్‌పూర్‌ జిల్లాకు చెందిన ముగ్గురు, సరన్‌ జిల్లాలో ముగ్గురు, వెస్ట్‌ చంపారన్‌ జిల్లాలో ఇద్దరు, అరారియా జిల్లాలో ఇద్దరు, బంకా, ముజఫర్‌పూర్‌ జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, మృతుల కుంటుంబాలకు సీఎం నితీష్‌ కుమార్‌ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement