Thursday, April 25, 2024

జులై 5న అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం…మంత్రి తలసాని

జులై 5వతేదీన అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమ్మవారి కళ్యాణం సందర్భంగా నూతన చీర తయారీని ఆలయ ఆవరణలో మంత్రి ప్రారంభించారు. ఈసారి అమ్మవారి కల్యాణానికి 5 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు.

అమ్మవారి కల్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 30 నుండి ప్రారంభమయ్యే బోనాలను ఘనంగా నిర్వహించేలా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గురువారం నుండి గోల్కొండ బోనాలతో ప్రారంభమవుతాయన్నారు. జగదాంబ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ చేయడం జరుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement