Saturday, May 4, 2024

ఏపీలో రేపటి నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ

ఏపీలో రేపటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 2021-22 పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 2,01,627 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు. ఇప్పటికే హాల్‌ టికెట్లు విడుదల చేశామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement