Thursday, May 9, 2024

హైదరాబాద్ : న్యాయవాద దంపతుల హత్య కేసు ప్రధాన నిందితుడు కుంటా శ్రీనివాస్ సికాస మాజీ మిలిటెంట్!

హైకోర్టు న్యాయవాది  గట్టు వామన్ రావ్ దంపతుల హత్యలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నవి.గుంజపడుగులో ఒక గుడి వివాదమే హత్యకు కారణంగా పోలీసులు చెబుతున్నారు. “కుల దేవత గుడి కూలితే వామన్ రావ్ కూలిపోతాడు” అని కుంటా శ్రీనివాస్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. న్యాయవాది దంపతులు హత్య కేసులో  ఇప్పటి వరకూ  పోలీసులు ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు. కుంటా శ్రీను ‘కాల్ డేటా’ ను రామగుండం పోలీసులు విశ్లేషించారు .ప్రధాన నిందితుడు శ్రీనివాస్ కుంటా గతంలో ‘సింగరేణి కార్మిక సమాఖ్య’లో మిలిటెంట్ గా పని చేసినట్టు తెలుస్తోంది. గతంలో సికాసలో పనిచేసిన కుంట శ్రీనివాస్‌పై అనేక కబ్జా, బెదిరింపుల కేసులు  ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement