Friday, April 26, 2024

శ్రీరామనవమి పండుగ రోజు విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

శ్రీరామనవమి సందర్భంగా రాములోరి కళ్యాణోత్సవాలతో అంతటా ఆనందోత్సవాలు జరుగుతుంటే పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడడంతో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లికి చెందిన ఎదిరోజు విజయ(30) తన ఇద్దరు పిల్లలు శ్రీ కూర్తి (16 నెలలు), శివకృష్ణ(3)తో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విజయ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. కాగా ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement