Saturday, May 11, 2024

వామ్మో.. వైన్ షాపుకు వేలంలో ఇన్ని రూ.కోట్లా?

సాధారణంగా మద్యం షాపులకు వేలంలో మంచి డిమాండ్ ఉంటుంది. కానీ రాజస్థాన్‌లో ఓ మద్యం షాపుకు వేలం నిర్వహించగా.. ఓ వ్యక్తి ఏకంగా రూ.కోట్లు కుమ్మరించాడు. రాజస్థాన్ సర్కారు ఇటీవల కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చింది. లాటరీ పద్ధతిలో వైన్ షాపులు కేటాయించే బదులు వేలం పద్ధతి పాటించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హనుమాన్ గఢ్ జిల్లా నోహర్‌లోని ఓ వైన్ షాపు కోసం వేలంపాట నిర్వహించారు. 15 గంటల పాటు జరిగిన హోరాహోరీ వేలంపాటలో కిరణ్ కన్వర్ అనే వ్యాపారి సదరు వైన్ షాపును కళ్లు చెదిరే ధరకు అంటే రూ.510 కోట్లకు సొంతం చేసుకున్నాడు. ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే.. గతంలో ఇదే వైన్ షాపును లాటరీ పద్ధతిలో కేవలం రూ.65 లక్షలకే అమ్ముడుపోయింది. కానీ వేలం పద్ధతిలో ప్రారంభ ధరను రూ.72 లక్షలుగా నిర్ణయించగా భారీ రేటు పలికింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement