Friday, April 26, 2024

రామంత‌పూర్ లో ఈజీ ప్లెవుడ్ గోదాంలో అగ్ని ప్ర‌మాదం..

న‌గ‌రంలోని రామంతపూర్‌లో ఉన్న ఈజీ ప్లెవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ గోదాంలో మంటలు చెల‌రేగ‌డంతో నిముషాల్లో గోదాం మొత్తం భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్ర‌మాదంలో ఫ్లైవుడ్ మొత్తం కాలిబూడిదైంది. వెంట‌నే స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి స‌మాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఇటీవల సికింద్రాబాద్, వనస్థలిపురం, బాగ్‌లింగంపల్లిలోని గోదాంలలో కూడా మంట‌లు చెల‌రేగాయి. భారీ ఆస్తి న‌ష్టం జ‌రిగింది. అయితే ఎండాకాలం ప్రారంభం కాక‌మునుపే అగ్ని ప్ర‌మాదాలు చోటుచేసుకుంటుండ‌డంతో ప్ర‌జ‌ల‌తోపాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement