Saturday, May 4, 2024

ముంబై : మళ్లీ కరోనా బారిన పడిన ’మహా‘ మంత్రి

మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి బచ్చు కడు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా సోకడం ఇది రెండో సారి. అలాగే మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేడ ఏక్ నాథ్ ఖడ్సే కూడా రెండో సారి కరోనా బారిన పడ్డారు. ఈయనకు కూడా కరోనా సోకడం ఇది రెండో సారి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇలా ఉండగా మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత మరోసారి పెరిగింది.  కరోనా వ్యాప్తి ఆరంభమైన తొలి నాళ్లలో విశ్వరూపం చూపి ఇటీవలే వ్యాప్తి నెమ్మదించిన కరోనా రాష్ట్రంలో మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అమరావతి జిల్లాలో నేడూ, రేపూ లాక్ డౌన్ విధించారు. కాగా గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 6,112 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు నాలుగు నెలల తరువాత రాష్ట్రంలో ఈ స్థాయిలో అధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిపారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement