గుంటూరు: ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు మాచర్లలో పర్యటించారు. జాతీయ పతాకం రూపొందించి ఈనెల 31తో వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మాచర్లలో నివాసం ఉంటున్న జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తెను ఘంటసాల సీతామహాలక్ష్మీని జగన్ సత్కరించారు. అనంతరం ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను తిలకించారు. అంతేకాకుండా సీతామహాలక్ష్మీకి రూ.75 లక్షల ఆర్థిక సాయం అందించాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను ఆమెకు అందజేసి నగదును ఖాతాలో జమ చేయించారు. అటు పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement