Friday, May 24, 2024

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 13, 742 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత ఒకింత పెరిగింది. మహారాష్ట్ర సహా ఏడు రాష్ట్రాలలో కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ కొద్ది సేపటి కిందట విడుదల చేసిన బులిటెన్ మేరకు దేశంలో కొత్తగా 13, 472 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 104 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,10,30,176కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,56,567కు పెరిగింది. గత 24 గంటల్లో దేశంలో కరోనా నుంచి కోలుకుని 14, 037 మంది ఢిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1, 46, 907 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement