Thursday, May 9, 2024

నిమ్మగడ్డవి వ్యర్థ ప్రయత్నాలు: రోజా

తెలుగుదేశం పార్టీని ప్రజలు 2019 ఎన్నికలలో చిత్తుగా ఓడించారన్న రోజా…ఆ పార్టీకి తిరిగి వైభవాన్ని తీసుకువచ్చేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇదేమీ జరిగే పని కాదన్న రోజా అదే విషయాన్ని రెండు రోజుల కిందట విలేకరుల సమావేశంలో చెప్పానన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ప్రశంస కోసం నిమ్మగడ్డ తాపత్రేయపడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. పంచాయతీ ఎన్నికలలో ప్రజలు మరోసారి వైకాపాకు పట్టం కట్టడమే జగన్ కు ప్రజలలో ఉన్న అభిమానానికి నిదర్శనమని రోజా అన్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement