Wednesday, May 8, 2024

తూ.గో.లో అత్యధికం.. విశాఖలో అత్యల్పం

ఏపీలో మున్సిపల్ ఎన్నిక‌ల పోలింగ్ అక్కడక్కడా స్వల్ప ఘటనలు మిన‌హా ప్ర‌శాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 32.23 శాతం పోలింగ్‌ నమోదైంది. తూర్పు గోదావ‌రి జిల్లాలో అత్య‌ధికంగా 36.31 శాతం ఓట్లు న‌మోదు కాగా, విశాఖ జిల్లాలో అత్య‌ల్పంగా 28.50 శాతం ఓట్లు న‌మోద‌య్యాయి.

జిల్లాల వారీగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాతం:
కృష్ణా జిల్లా- 32.64 శాతం
చిత్తూరు జిల్లా-30.12 శాతం
ప్రకాశం జిల్లా-36.12 శాతం
కడప జిల్లా-32.82 శాతం
నెల్లూరు జిల్లా-32.67 శాతం
విశాఖ జిల్లా-28.50 శాతం
కర్నూలు జిల్లా -34.12 శాతం
గుంటూరు-33.62 శాతం
శ్రీకాకుళం-24.58 శాతం
తూర్పుగోదావరి-36.31శాతం
అనంతపురం-31.36 శాతం
విజయనగరం-31.97 శాతం
పశ్చిమ గోదావరి-34.14

Advertisement

తాజా వార్తలు

Advertisement