Thursday, May 2, 2024

తిరువనంతపురం :కేరళలో మళ్లీ కరోనా విజృంభణ

 కేరళలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తున్నది. . మలప్పురంలోని   రెండు పాఠశాలలకు చెందిన 192 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది. వీరిలో 91 మంది విద్యార్థులు ఒకే ట్యూషన్‌ సెంటర్‌కు వెళ్తున్నట్లు గుర్తించారు.   దీంతో ఆ ట్యూషన్‌ సెంటర్‌తో పాటు ఈ రెండు పాఠశాలలనూ    మూసివేశారు. విద్యార్థులందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు డీఈవో చెప్పారు. కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయిన వారిలో 149 మంది ఒకే పాఠశాలకు చెందిన వారు కాగా, మరో 43 మంది విద్యార్థులు వేరే పాఠశాలకు చెందినవారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement