Thursday, May 2, 2024

టీడీపీ మేనిఫెస్టోను చూసే ఓటేయండి: లోకేష్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విశాఖ జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆయన గాజువాక నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గాజువాక చేరుకున్న లోకేష్‌కు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. తొలుత సింహాద్రి అప్పన్నను లోకేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, సిబ్బంది ప్రత్యేకపూజలు నిర్వహించి లోకేష్‌కు తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం గాజువాకలో రోడ్‌షో నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్.. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోను చూసే ఓటేయాలని ప్రజలను కోరారు. అధికారంలో ఉన్న వైసీపీ.. టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందేమీ లేదని విమర్శించారు. కాగా ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement