Friday, April 26, 2024

చెన్నై : ఐపీఎల్ వేలం : మ్యాక్స్ వెల్: @ రూ.14.25 కోట్లు

ఐపీఎల్  వేలంలో  ఆస్ట్రేలియా   ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ను  రూ.14.25 కోట్ల మొత్తానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దక్కించుకుంది. కాగా, వేలం సందర్భంగా మ్యాక్స్ వెల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కూడా చివరివరకు ఆర్సీబీతో పోటీపడింది. మ్యాక్స్ వెల్ కనీస ధర రూ.2 కోట్లు కాగా, వేలం పోటాపోటీగా సాగింది. చివరికి మ్యాక్స్ వెల్ ను  ఆర్సీబీ సొంతం చేసుకుంది.  అయితే  ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్  కెప్టెన్ ఆరోన్ ఫించ్, భారత   ఆటగాడు హనుమ విహారిలను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.  మరో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. స్మిత్ వంటి అగ్రశ్రేణి ఆటగాడు తాజా వేలంలో రూ.2.20 కోట్లకే అమ్ముడయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement