Wednesday, April 24, 2024

ద్విపాత్రాభినయం చేయనున్న ‘పార్వతి నాయర్’

తన తదుపరి చిత్రంలో ద్విపాత్రాభినయం చేయనుంది హీరోయిన్ పార్వతి నాయర్. తాజాగా ఆమె తన కోలీవుడ్‌ సినీ కెరీర్‌పై స్పందిస్తూ, ప్రస్తుతం తాను ‘ఆలంబనా’ చిత్రంలో నటిస్తున్నానని, ఈ మూవీ తర్వాత ఓ సైకలాజికల్‌ మూవీలో నటించనున్నట్టు తెలిపింది. ఇందులో తొలిసారి యాక్షన్‌ సన్నివేశాల్లో నటిస్తున్నానని, ఇందుకోసం శిక్షణ తీసుకుంటున్నట్టు చెప్పింది.   మరో చిత్రంలో నటించేందుకు కమిట్‌ అయ్యాయని.. ఇది తమిళ, హిందీ, మరాఠీ, మలయాళంతో పాటు పలు భాషల్లో నిర్మితం కానుందని, బాలీవుడ్‌లో ప్రముఖ డీవోపీగా గుర్తింపు పొందిన కబీర్‌ లాల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్టు ఆమె తెలిపింది. ఈ చిత్రంలో తాను అక్కాచెల్లెళ్ళుగా ద్విపాత్రాభినయం చేస్తున్నటు చెప్పింది. అలాగే, నయనతార, త్రిష, ఐశ్వర్యా రాజేష్‌ వంటి నటీమణుల తరహాలోనే తాను కూడా హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉన్న కథా చిత్రాల్లోనే నటిస్తానని పార్వతినాయర్‌ చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement