Thursday, April 25, 2024

ఫ్యాన్స్ ని బాధ్యతగా నడుచుకోమన్న ‘అజిత్’

తన అభిమానులు బాధ్యతగా నడుచుకోవాలని తెలిపాడట తమిళ స్టార్ హీరో అజిత్. ప్రస్తుతం ఈయన ‘వలిమై’ చిత్రంలో నటిస్తున్నారు. అయితే, చిత్ర విశేషాలను ఎక్కడా వెల్లడించలేదు. దీంతో ఆయన అభిమానులు ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను వెల్లడించాలంటూ పదేపదే ఒత్తిడి చేస్తున్నారు. అంతటితో ఆగని కొంతమంది అభిమానులు వాల్‌పోస్టర్లు ముద్రించి గోడలకు కూడా అంటిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీనికితోడు సోషల్‌ మీడియాలో నిరంతరం వలిమై అప్‌డేట్స్‌ కోసం చర్చ సాగుతూనే ఉంది. ఈ వ్యవహారంపై అజిత్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.  గత కొన్ని రోజులుగా తన అభిమానులుగా చెప్పుకునే కొంతమంది వలిమై చిత్ర విశేషాలను వెల్లడించాలని చేస్తున్న హంగామా తీవ్ర మనోవేదనకు గురిచేసిందని, ముందుగా ప్రకటించినట్టుగా ఈ చిత్ర విశేషాలను తగిన సమయం, సందర్భాన్ని చూసుకొని దర్శకనిర్మాతలతో చర్చించి వెల్లడిస్తానని, అప్పటివరకు ప్రశాంతంగా ఉండాలని ప్రకటనలో కోరారు. మన వ్యవహారశైలి సమాజంలో మనపై ఉన్న మర్యాదను పెంచుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తన అభిమానులు సమాజంలోనూ, సోషల్‌ మీడియాలోనూ బాధ్యతగా నడుచుకోవాలని కోరారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement