Thursday, May 2, 2024

అహ్మదాబాద్ : ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 81 ఆలౌట్- భారత విజయ లక్ష్యం 49 పరుగులు

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అక్షర్ పటేల్ 5 వికెట్లు, అశ్విన్ నాలుగు వికట్లు తీసుకున్నారు. చివరి వికెట్ వాషింగ్టన్ సుందర్ ఖాతాలో పడింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 112 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి విదితమే. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 145 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత సాధించింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులకు కుప్పకూలడంతో ఈ టెస్టు లో విజయం సాధించాలంటే భారత్ 49 పరుగులు చేస్తే సరిపోతుంది. విపరీతంగా స్పిన్ అవుతున్న పిచ్ పై బారత స్పిన్ ద్వయాన్ని ఎదుర్కోవడంలో ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ ఆలౌట్ కాగానే డిన్నర్ బ్రేక్ విరామం వచ్చింది. ఈ రోజు ఆటలో ఇంకా ఒక సెషన్ మిగిలి ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఫలితం ఈ రోజే తేలే అవకాశం ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement