Saturday, May 4, 2024

‘అమితాబ్’ ఇంటికి భద్రత పెంపు

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంటికి భద్రత పెంచారు. చమురు ధరలు మండిపోతుండడం పట్ల అమితాబ్ బ‌చ్చ‌న్ స‌హా బాలీవుడ్ నటులు స్పందించకపోవడం పట్ల  మహారాష్ట్ర కాంగ్రెస్  అధ్యక్షుడు నానా పటోలే విమ‌ర్శించారు.  అమితాబ్ బచ్చన్  నిజమైన హీరో కాదంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో అమితాబ్‌ బచ్చన్‌ నివాసం వద్ద పోలీసులు భద్రత పెంచారు. తాత్కాలికంగా తీసుకుంటున్న‌ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భ‌ద్ర‌త‌ను పెంచిన‌ట్లు పోలీసులు అంటున్నారు. అయితే, ఎందుకు భద్రత పెంచార‌న్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేదు. పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడంపై అమితాబ్ వంటి హీరోలు త‌మ తీరు ఏంటో చెప్ప‌క‌పోతే  మహారాష్ట్రలో వారి సినిమాల ప్రదర్శనలతో పాటు షూటింగుల‌కు  అనుమతించబోమని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే చేసిన హెచ్చ‌రిక నేప‌థ్యంలోనే పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement