Thursday, May 2, 2024

అమరావతి : కొడాలి నానికి ఎస్ఈసీ షోకాజ్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు, సర్కార్ కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తొలి విడత పంచాయతీ తరువాత కూడా కొనసాగుతోంది. తాజాగా మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జగన్నాథ రథ చక్రాల కింద పడి నలిగిపోతారంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఈ షోకాజ్ జారి చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా వైకాపా విజయం తథ్యమని కొడాలి నాని పేర్కొంటూ, ఏపీ సీఎం జగన్ చిటికెన వేలిని కూడా ఎవరూ కదపలేరన్నారు. నాని వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కొడాలి నానికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నిల సంఘం కమిషనర్ ను కించ పరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరింది. ఈ రోజు సాయంత్రం లోగా వ్యక్తిగతంగా లేదా ఆయన ప్రతినిథి ద్వారా కానీ వివరణ ఇవ్వాలనీ, లేకుంటే చర్యలు తప్పవని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement